Home » YSRCP
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
మున్సిపల్ చైర్మన్ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు.
జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్పై కిరణ్ రాయల్ కేసు బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారిపై పిర్యాదు చేసింది.
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. ఏపీకి వచ్చిన కంపెనీలకి సౌకర్యాలు కల్పించారా అని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నాగార్జున యాదవ్పై ఫిర్యాదు చేశారు.