Home » YSRCP Cadre
మచిలీపట్నం పోలీసులు యాక్షన్ చేపట్టడంతో మాజీ మంత్రి పేర్ని నాని దిగొచ్చారు. ఈ క్రమంలో పేర్ని నానితో సహా మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి క్యూ కట్టారు వైసీపీ నేతలు.
జగన్ ఏపీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి జగన్ వచ్చి మాట్లాడవచ్చు కదా అని హితవు పలికారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ప్యాలెస్లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.
గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.
పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.
మచిలీపట్నం పోలీసు స్టేషన్లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.