Home » YS Jagan Mohan Reddy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కిచెప్పారు.
AP Police Vs Jagan: వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని.. అరెస్ట్లు చేశామని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు.
Somireddy Slams Jagan: చంద్రబాబు ఇళ్లు, పార్టీ కార్యాలయంపై దాడులు ఎందుకు చేయించారని ఎమ్మెల్యే సోమిరెడ్డి నిలదీశారు. జగన్ బుద్దిమంతుడు.. తాము అరాచకవాదులమా అంటూ ఫైర్ అయ్యారు.
ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో అశాంతి సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపించారు. త్వరలోనే పేర్ని నాని జైలుకు పోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు.