Home » YCP
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. నేడు జగన్.. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి చెందిన ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పార్టీలో తనకు జరిగిన అవమానం, అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు.
తిరుపతిలో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.