Home » WPL
సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డులోకెక్కింది.
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుని.. తొలుత ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది..
డబ్ల్యూపీఎల్ 2026 లో భాగంగా శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా ముంబైని రెండో సారి ఓడించింది.
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నేడు యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఆది నుంచే చెలరేగుతూ ఆడిన యూపీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించారు. ముంబైకి 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ స్పందించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026కి ఎన్నికల ఎఫెక్ట్ తగలనుంది. మ్యాచులు జరుగుతున్న నవీ ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో భద్రతా బలగాలు సరిపోవని పోలీసులు బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. ఇదే జరిగితే మూడు రోజులు ఫ్యాన్స్ లేకుండానే మ్యాచులు నిర్వహిస్తారు.
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది.
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తమ ఓటమిపై స్పందించింది. తమ జట్టు ప్రదర్శన, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.