Home » Warangal
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటీకే పలు కీలక శాఖలు నిర్వీర్యం కాగా ఇంకొన్నిటి పట్టు సడలుతోంది.
లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయిందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయనున్నది.
వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.
మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.
జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.