Home » Warangal
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.
వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి.
సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకొంటున్నాయి. శనివారం ఉదయం 6.00 గంటలకు ఇన్నయ్య తండ్రి గాదె సోలోమాన్ రెడ్డి కన్నుమూశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి.
ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది.
దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..