Home » Warangal
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటినుంచి జాతర జరగనుంది. దాదాపు కోటిమందికి పైగా భక్తులు విచ్ఛేస్తారని అంచనా. అయితే.. జాతర సమయంలో రద్దీ ఉంటుందనే భావనతో.. భక్తులు ముందుగానే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆఎర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిననాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ఈసారి మొత్తం 600 హుండీలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రధానంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఓ హుండీని ఏర్పాటుచేయగా.. జాతర ప్రాంగణంలో మొత్తం 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ‘తెలంగాణ కుంభమేళ’గా పిలిచే మేడారం మహాజాతర జోరు అనధికారికంగా నెల రోజుల ముందే మొదలయ్యింది. ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపించనుంది.
మార్బుల్స్ దించుతుండగా మీద పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మేడారం మహాజాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహా జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జాతర జరిగే ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్కాగజ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.
మేడారం సమ్మక్క తల్లికి పుట్టింటి చీరను సమర్పిచారు. మహాజాతరకు ముందు సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.