Home » Warangal
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
నగర జీవితంలో ట్రాఫిక్ జామ్లు, మాల్స్ హడావిడి, మొబైల్ స్క్రీన్లతో గందరగోళంతో ఉన్నారా. ఈ దసరా సెలవుల్లో ప్రకృతి ఒడిలోకి చేరుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. అందుకోసం హైదరాబాద్ నుంచి 5 గంటల దూరంలో చక్కటి ప్లేస్ ఉంది. అది ఏంటి, ఎలా వెళ్లాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీ్సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
రాజస్థాన్లో రైలులో వెళ్తుండగా దుండగులు దాడి చేసి రైలులోని అత్యవసర ద్వారం నుంచి కిందకు విసిరేయడంతో రెండు కాళ్లు కోల్పోయిన వరంగల్ జిల్లా హన్మకొండ దామెర మండలం నివాసి గుండెటి రాహుల్ కృత్రిమ కాళ్లతో చకచక అడుగులు వేస్తున్నారు.
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.
అధికార పార్టీ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని..
హనుమకొండకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే.. వరుడికి చెందిన 30 మందికి పైగా బంధువులు ఓ ట్రావెల్ బస్సులో పెళ్లికి వెళ్లారు. వివాహం అనంతరం అదే బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.