Home » Visakhapatnam
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు.
విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఓ మణిహారం. అక్కడ ఉద్యోగం అంటే జీవితానికి భరోసా. ఆ ఘనతంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు.. ఎప్పుడెప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేద్దామా అని ఉద్యోగులు ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్లో ఉద్యోగుల రాజీనామా పరంపర కొనసాగుతూ ఉంది.
గత ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
విశాఖపట్నంలోని లంకెలపాలెం - అగనంపూడి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడలో సూట్కేసులో లభ్యమైన యువతి మృతదేహం విశాఖకు చెందిన సంధ్యదిగా పోలీసులు గుర్తించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది.
ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని.. అంతర్జాతీయ విమానాశ్రయం వలన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తాయని అన్నారు.