Home » Visakhapatnam
అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ను 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని... 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు.
మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రమంత్రి నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటువంటి ఆవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడురోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించారు.