Home » Visaka
కేజీహెచ్లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.
విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి.
రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీనే మనల్ని నడిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
అప్రమత్తమైన పైలట్ ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి విశాఖ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ సమయానికి చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 103 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
విశాఖపట్నంలోని రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.