Home » Virat Kohli
గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది.
పాక్ జట్టుకు సంబంధించి అత్యుత్తమ బ్యాటర్గా నిలిచిన బాబర్ ఆజామ్, గత కొద్ది కాలంగా వన్డేల్లో నిలకడ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అదే పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు.
పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో అగ్రెషన్తో ఉండే కోహ్లీ.. తండ్రి అయ్యాక నెమ్మదస్తుడు అయ్యాడని తెలిపాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు నేడు. 27 వేల పరుగులు, 82 సెంచరీలతో ప్రపంచ క్రికెట్ను శాసించిన రన్ మెషీన్ ఇప్పటికీ తన జోరు తగ్గించలేదు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విశ్వ విజేతగా భారత జట్టు అవతరించడంతో మగువల క్రికెట్కు దేశంలో ఆదరణ అమాంతం పెరిగింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించడంతో మహిళల క్రికెట్ బ్రాండ్ అట్టడుగు నుంచి టాప్ లోకి ఎగబాకింది. ఈ క్రమంలో మహిళలు, పురుషుల క్రికెటర్లు కలిసి ఆడితే సూపర్ గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న వన్డే ప్రపంచ కప్లో ఆడుతారా? అనే ప్రశ్నపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని.. వారు ఇక్కడే ఉంటారని తెలిపారు. రో-కో వారి జీవితాన్ని భారత క్రికెట్కు అంకితం చేశారని అన్నారు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. క్రికెట్ లో రాణిస్తున్న కోహ్లీ.. . కొన్నేళ్ళ క్రితం 'వన్ 8 కమ్యూన్' పేరుతో చైన్ రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.