Home » Virat Kohli
సౌతాఫ్రికా-భారత్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో రాహుల్ కెప్టెన్సీలో ఫామ్ అందుకుని వరుసగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ .. ఈ సిరీస్లో మళ్లీ అదే రికార్డు తిరగరాయనున్నాడా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
త్వరలోనే సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే కోహ్లీ-రోహిత్ శర్మ సిద్ధమయ్యారు. తొలి వన్డేలో రో-కో జోడీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.
సొంతగడ్డపై టీమిండియా వరుస పరాభవాలు చవి చూస్తుంది. న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్.. కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ రికార్డుల గురించి నెట్టింట చర్చ మొదలైంది.
వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్న టీ20 ఆల్టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో, అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రోహిత్, కోహ్లీకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈరోజు(నవంబర్ 15) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అతడు 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియం వేదికగా వన్డేల్లో తన 50వ సెంచరీ నమోదు చేశాడు. అతడు ఈ ఘనతను వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్పై సాధించాడు.
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కోహ్లీ లేకుండా ఈడెన్ గార్డెన్స్లో టెస్టు మ్యాచ్ ఆడటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి.