Home » Virat Kohli
ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో పరుగులు చేశాడా? లేదా? అన్నదానితో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని కొలవలేమని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇంగ్లండ్తో చివరి వన్డేలో కోహ్లీ అర్థశతకం చేసిన సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉంటారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇద్దరి మధ్య సఖ్యత లేదంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తాజాగా ఓ ఫొటోతో ఆ ఇద్దరూ సమాధానం ఇచ్చేశారు.
వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్తో తొలి వన్డే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం చర్చనీయాంశం అయింది.
విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం.
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతారా? అనే విషయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి వారని తెలిపాడు.
భారత క్రికెట్లో మూడు తరాల స్టార్ ప్లేయర్లను ఒకే ఫ్రేమ్లో చూపిస్తూ వింబుల్డన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్మన్ గిల్ వింబుల్డన్ వీక్షించిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.