Home » Virat Kohli
కొత్త ఏడాది వేళ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లీ గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.
ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురని ఏడాదిగా మిలిగిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఏడాది చివరిలో సౌతాఫ్రికాపై స్వదేశంలోనే క్లీన్ స్వీప్ అయ్యే వరకు ప్రతి మ్యాచ్ ప్రతి మూమెంట్ చిరస్మరణీయం.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తు్న్న కోహ్లీ.. గుజరాత్తో మ్యాచులో 77 పరుగుల వద్ద ఔటయ్యాడు. తన వికెట్ తీసుకున్న బౌలర్ విశాల్కు విరాట్ గిఫ్ట్ ఇచ్చాడు.
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. వీరిద్దరూ వేరే వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. తమ ఫామ్ని మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. రోహిత్ సెంచరీ చేయగా.. విరాట్ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కొనసాగుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.