Home » Viral Video
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది..
జమ్ము కశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ లోయలో భారీగా మంచు చరియలు విరిగిపడి ఉప్పెనలా దూసుకొచ్చిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన ‘అమ్మకాయ్’ రెస్టారెంట్ ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఊహించని విధంగా భారీ ఎత్తున జనం రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్కు తెరతీశాడు. ఓ చిన్న కుక్కపిల్లను 100 రోజుల పాటు పెంచి 101వ రోజు తినడానికి సిద్ధమయ్యాడు. అయితే ఊహించని విధంగా ఆ ఛాలెంజ్ బెడిసికొట్టింది. జంతు ప్రేమికులు అతడికి సరైన విధంగా బుద్ధి చెప్పి.. ఆ శునకాన్ని రక్షించారు.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పాక్ ప్రజల జీవన విధానం, అక్కడ మౌలిక వసతులకు సంబంధించిన వీడియోలు చర్చనీయాంశంగా మారతున్నాయి.
కప్పలు, ఎలుకల వంటి జంతువులను పాములు ఆహారంగా తీసుకుంటాయి. అయితే పాముల వేటకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చేపను పాము అసాధారణ రీతిలో పట్టుకుంది.
బండారు దొరబాబు పెంచుకుంటున్న చిలుక ‘ఆఫ్రికన్ గ్రే ప్యారట్’ జాతికి చెందినది. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ.80 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది.
గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. రిపబ్లిమ్ డేను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదంచల భద్రత ఏర్పాటు చేశారు.