Home » Vasamsetti Subash
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు.. అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణా కేంద్రాలుగానూ మారతాయని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్.. గొప్ప క్రెడిట్ సాధించారని మండిపడ్డారు.
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వీఎస్ఎమ్ కాలేజ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తలనీలాల స్కామ్, పరాకామణి దోపిడి వంటి కోట్ల రూపాయల అవినీతి పనులు జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు.
గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
Minister Subhash: నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ వారికి ఒక రుణం కూడా మంజూరు చేయలేదని జగన్పై మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.
మ్యాన్పవర్ ఏజెన్సీల ద్వారా పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం, పీఎఫ్ చెల్లించడం వంటి అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఇక నుంచి ఈ దుష్ప్రవర్తనను ఉపేక్షించేది లేదని చెప్పారు
TDP Leaders: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని.. ప్రతిపక్ష నేత కాదని అన్నారు.