Home » Uttar Pradesh
ఓ యువకుడు బట్టల షాపులోకి చొరబడి ఓ యువతిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆమె పీక మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. లక్ష రూపాయలు ఇస్తే కానీ యువతిని వదిలిపెట్టనని అన్నాడు.
వీవీఐపీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు పలు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యను 5 జోన్లు, 10 సెక్యూరిటీ సెక్టార్ల కింద విభజించినట్టు సిటీ ఎస్పీ సీపీ త్రిపాఠి తెలిపారు.
ఈనెల 31న ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ప్రకటించారు. ఈ ఉత్సవాలకు రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించామని, ఆయన తన సమ్మతి తెలియజేశారని చెప్పారు.
ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు. ఓ అమ్మాయిపై మరో అమ్మాయి దాడి చేసింది. నడిరోడ్డులో చావ చితకబాదింది. తన బాయ్ ఫ్రెండ్ను బాబు అని పిలిచినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది.
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ యువకుడి మోజులో పడ్డ వివాహిత తన ఐదుగురు పిల్లలను కాదనుకుని అతడితో వెళ్లిపోయింది. తల్లి జాడ తెలియక పిల్లలు తల్లడిల్లుతున్న వైనం స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది.
అడవి పందిని పట్టుకుందామని వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు దారుణమైన అనుభవం ఎదురైంది. ఆ అడవి పంది ఓ ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడిచేసింది. తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నేషనల్ హైవేపై పట్టపగలు ఓ భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా దోచేశారు. ఏకంగా 85 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.