Home » Uttar Pradesh
పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఓ కారు తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు గాయపడ్డారు.
అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది.
ఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది. పైలట్ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగైనా పైలట్ కావాలన్న ఆ చిన్నారి ఆశయం.. నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
తన కుమార్తె అదితి యాదవ్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.
కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...
సైనిక అధికారిగా నటిస్తూ జనాల్ని మోసగిస్తున్న ఒక యువకుడి కోసం ఉచ్చు పన్నిన ఆర్మీ అధికారులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ పేరు అమేథీ జిల్లాలోని మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి గల్లతైంది. 2024 లోక్సభ, 2022 అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఇదే ప్రాంతం నుంచి ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉంది.
దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.