Home » Uttar Pradesh
దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.
కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారం సాయంత్రం వారణాసి లోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద జరిగిన 'గంగా హారతి'లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు.
పెళ్లి చేసుకొని సుఖంగా దాంపత్య జీవితం గడపాల్సిన ఓ జంట మధ్య అనుకోకుండా విభేదాలు తలెత్తాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోకపోవడంతో.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే...
భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్ని..
నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధాని కాలేరని, బీజేపీకి ఈ ఎన్నికల్లో 180కి మించి సీట్లు రావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి తుఫాన్ రానుందని, దేశంలో బీజేపీ అతిపెద్ద ఓటమిని ఇక్కడే ఎదుర్కోనుందని తెలిపారు.
దేశంలో లోక్సభ ఎన్నికల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఒకటే సీన్. ఆ యా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ వేసేందుకు.. తమ అనుచరగణంతో కలిసి వెళ్తారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.
ప్రధాని మోదీ తన పదేళ్ల హయాంలో ఒక్క పథకాన్నైనా ప్రారంభించారా, ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.