Home » Uravakonda
స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది.
కర్నూలు బారిస్టర్స్ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు.
పట్టణంలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉరవకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలురు కళాశాలలో 331మంది విద్యార్థులకు గానూ 12మంది గైర్హాజరయ్యారు. 319మంది పరీక్షలకు హాజరయ్యారు.
పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన పురాతన లక్ష్మీ నర సింహస్వామి దేవాల యంలో సోమ వారం స్వామి వారి కల్యా ణాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించా రు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండి తులు అలంకరించి, శాసో్త్రక్తంగా కళ్యాణో త్సవాన్ని నిర్వహించా రు.
హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమి షనర్ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్, ఇతర అధికారులు క్రికెట్, షటిల్, టెన్నిస్ ఆటలలో పాల్గొన్నారు.
మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయం లో కుంకుమా ర్చన చేశారు.
కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.
మండలంలోని పాల్తూరు పోలీస్ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్ కానిస్టేబుల్ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం కల్తీదా, నాణ్యమైనదా అన్న విషయం తెలుసుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్ను ఆయన గురువారం తనిఖీ చేశారు.