Home » Uravakonda
హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు.
సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అత్తారింట్లో అల్లుడికి మర్యాదలు తగ్గితే గొడవలైపోతాయి..! బలగం సినిమాలో ‘నల్లిబొక్క’ ఎన్ని గొడవలకు దారి తీసిందో చూశాం కదా..! అది తెలంగాణ..! కాబట్టి ‘హాట్.. మీట్’ గొడవ జరిగింది.
నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్ను బుధవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు.
స్థానిక మార్కెట్ యార్డు లో చైర్పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది.
మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.
ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్ ధర్నా నిర్వహించారు.
జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.