Home » Uravakonda
పట్టణంలో భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు ఉదయం గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపనతో పాటు సాయం త్రం హోమాలు నిర్వహించారు.
పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు.
విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్ ఫస్ట్క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు.
మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు.
కలెక్టర్ ఒ. ఆనంద్ పామిడి మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఎం లక్ష్మీదేవి ఇంటిపై అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్ను పరిశీలించారు. పట్టణంలో 50 యూనిట్లకు ప్రస్తుతం 35 యూనిట్లు పూర్తయినట్లు ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు పేర్కొన్నారు.
స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.
మండలంలోని పా తకొత్తచెరువు గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ డీవైడర్ను ఢీ కొని రోడ్డుపైనే నిలిచిపోయింది. బీఆర్ 24, జీడీ 2986 అనే 14 చక్రాల లారీ గుత్తి వైపు నుంచి బళ్లారికి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న లా రీ డ్రైవర్గుత్తి సమీపంలో ముందు వెళ్తున్న షిప్ట్ డీజైర్ వాహనానికి త గలించాడు.
కేంద్ర ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వా రు మంగళవారం స్ధానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల రెన్యువల్కు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతు న్నా బ్యాంకుల వద్ద వేచి ఉండి రెన్యువల్ చేసుకుంటున్నారు. అయితే వారికి బ్యాంకు వద్ద నీడ వసతి కల్పించాల్సిన బ్యాంకర్లు కరుణించే పరిస్థితి లేదు.