Home » Uravakonda
టీడీపీ ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని జక్కలచెరువు గ్రామంలో రూ. 20లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మించారు. ఎమ్మెల్యే గురువారం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు.
రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసే సమ యంలో భూసార పరీక్షలు చేయించుకోవా లని విశాఖపట్నం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనాధికారి డాక్టర్ కె .రాంబాబు, కేంద్ర వ్యవసాయశాఖ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అధికారి డాక్టర్ పి. రాము పేర్కొన్నారు.
పట్టణంలో మంగళవా రం సాయంత్రం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు వర్షం పడడంతో స్థానిక టవర్క్లాక్ కూడలిలో వర్షపు నీరు నిలబడి వాహనదారులు, పాదాచారులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు.
ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు.
వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో సోమవారం పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్ సోమవారం భూమిపూజ చేశారు.
కర్నూలు జిల్లాలో వీ ఆర్వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.
పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.