Home » Uravakonda
ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు.
వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో సోమవారం పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్ సోమవారం భూమిపూజ చేశారు.
కర్నూలు జిల్లాలో వీ ఆర్వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.
పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పలు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పని తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని జిల్లా సచివాలయాల అధికారి నాసర రెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి హెచ్చరించారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పట్ట ణం, మండలంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వ హించారు.
పీఏబీఆర్ డ్యాం నుంచి అనంతపురం నగరానికి సరఫరా అయ్యే తాగునీరు కూడేరు మండలంలోని వివిధ ప్రదేశాల్లో వృథాగా వంకల్లోకి వెళ్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం హ యాంలో అసంపూర్తిగా ఆగిపోయిన స్వర్ణ గ్రామ పంచాయతీలు, రైతు సేవా కేంద్రాలు, అంగన వాడీ కేంద్రాల నిర్మా ణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.21.33కోట్లు నిధులను మంజూరు చేసింది. వైసీపీ ప్రభు త్వంలో నియోజకవర్గంలో పలు అంగనవాడీ భవనాలు, గ్రామ సచివాల య భవనాల నిర్మాణం చేపట్టారు.