Home » Uravakonda
నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తి గా ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా పలువురు హెచఎంలు స్పందించడం లేదు. మండలంలో నాడు- నేడు మొ దటి, రెండో విడత కింద గత వైసీపీ పాలనలో వివిధ పాఠశాలలకు నిధులు విడుదల చేశారు.
పాడి పరిశ్రమలో కీలకమైన పశుగ్రాసం కొరతతో పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలతో వరి పంట కోసేందుకు యంత్రాలు ఉపయోగిస్తు న్నారు. ఇందులో మమకూలీల కొరత ఒక కారణమైతే, ఖర్చులు పెరగ డంతో సాగుదారులు యంత్రాలపై ఆధారపడడం ఏటా పెరుగుతోంది.
మండల పరిధిలోని పెన్నహో బిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హంస వాహనంపై నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతా ళాల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా రోడ్డు వేయకుండా ఉండడంతో మండలంలోని డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డొనేకల్లు నుంచి 1.5కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు(తారురోడ్డు) వేశారు.
వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు.
వివిధ పనులపై స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు.
పట్టణంలోని పాత స్టేట్బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు.
మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్, పెట్రోల్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్ ఔట్లెట్లకు సకాలంలో డీజిల్, పె ట్రోల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది.