Home » Uravakonda
ముస్లింలు పవిత్ర రంజాన పండుగను పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో ఈదుల్ఫితర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్ణ యించిన వేళకు సానిక ఈద్గాల వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీలు నమాజ్ను చదివి వినిపించారు. రంజాన యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు.
మండలంలోని మరుట్ల రెండో కాలనీలో విద్యుత వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చేతికందే ఎత్తులో ట్రాన్సఫార్మర్ అమర్చడంతో పాటు వి ద్యుత లైన్లు కిందనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరుట్ల రెండో కాలనీలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రహరీకి ఆనుకొని విద్యుత ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేశారు. దానిని తక్కువ ఎత్తులో అమర్చారు.
బద్ధకం విడిచి కష్టప డితేనే భవిష్యత్తులో రాణిం చగలుగుతారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లు పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల మనసు గెలవడానికి శ్రమించాలన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం తాజా మాజీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతిని ఘనంగా సన్మానించారు.
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రం గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వే స్తోంది. అందులో భా గంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజాప్రతిధు లు, అధికారుల, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయినా గ్రామీణ ప్రాంతాలలో కొందరు పనికిరాని వస్తువులను ఖాళీ స్థలాలలో పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.
మండలంలోని గ్రామదట్ల గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని శుక్రవారం గ్రా మపెద్దల ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఉద యాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్ద ల ఆధ్వర్యంలో రూ. 20 లక్ష లతో నూతన రథాన్ని తయా రు చేయించినట్లు గ్రామస్థు లు తెలిపారు.
మండలంలోని కొడవండ్లపల్లి పెద్దమ్మ దేవత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం ఉదయం అమ్మవారిని సి డిబండిపై తిమ్మంపల్లి నుంచి కొడవండ్లపల్లికి తీసుకెళ్లను న్నారు.
మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఉత్స వాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా ఉగాది నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహరెడ్డి తెలిపారు.
మండల వ్యాప్తంగా రెండో రో జు బుధవారం రాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల మండల వ్యాప్తంగా 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. దీంతో రూ. 40 లక్షల వరకు పంట నస్టం జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా అరటి పంట దెబ్బతింది.
ఉగాది పండుగను పురస్కరించు కొని గురువారం మండలంలోని రాయలచెరువు గ్రామంలో వెలసిన చె న్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంతకల్లు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ఉత్సవమూర్తికి ఆనవాయితీగా చేపట్టే బియ్యం కొలిచే పోసే కార్యక్రమాన్ని నిర్వహించా రు.