DONATION: కసాపురం ఆలయానికి రూ. 2.34లక్షల విరాళం
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:57 PM
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567 విరాళం అందజేశారు.
గుంతకల్లుటౌన, జూన 13(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567లు విరాళం అందజేశారు. శనివారం ఆలయ ఈఓ విజయరాజుకు తలారి రవి కుమార్ చెక్కును అందజేశారు. అనంతరం దాతలకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వాదం చేసి శేష వస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....