Home » Uravakonda
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని బ్రాహ్మ ణపల్లి, పూలకుంట, గుర్రబ్బాడు గ్రామాల్లో పెద్దకదిరప్ప స్వామిని సో మవారం పల్లకిలో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని గుంతకల్లు గుత్తి, పామిడి మండలాల్లోని గ్రామాల్లో అన వాయితీగా ప్రతిఏడాది మార్చి నెలలో స్వామి ఉత్సవ విగ్రహాన్నా 25 రోజుల పాటు 35 గ్రామాల్లో పల్లకిలో ఊరేగిస్తామని అర్చకులు రామాం జునేయులు స్వామి తెలిపారు.
పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభ మయ్యాయి. మండల వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రవినాయక్ తెలిపారు. మొత్తం 1518 మందికి గాను 26 మంది గైర్హాజరయ్యారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్ మంజునాథ్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మండలపరిధిలోని కడదరకుం ట గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ తోటల్లో జరిగిన ప్రమాదంలో దానిమ్మ చెట్లతో పాటు బెండ, అలసంద పంటలు కాలిపోయాయి. దీం తో రూ. లక్షలో నస్టం వాట్టిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
గత ఏడాది మేలో హం ద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు వజ్రకరూరు మండలం చాయాపురానికి ఇచ్చిన హామీలు నెరవేరాయి. అందుకు అనుగుణంగా గ్రామంలో రూ.2. 26కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
బాలికలు తప్పని సరిగా క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన వేయించుకో వాలని వైద్యాధికారులు తెలిపారు. పీహెచసీల్లో బుధవారం సర్వేకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ క్యాన్సర్)ను నివారించేందుకు హ్యూమన పాపిల్లో వైరస్ వ్యాక్సిన వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హ మీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో వివిధ గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పల్లె పండుగ-2.0 కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.86 కోట్ల నిధులు మంజూరు చేశారు.
పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేనేజ్మెంట్ ఫెస్ట్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో అభి నందించారు.