Home » TS News
64 కళల్లో చోరకళ కూడా ఒకటి అంటారు. అయితే కనీసం ఒంటికి తెలియకుండా ఒంటి మీదున్నవన్నీ వలిచేయడం చోరకళలో ప్రావీణ్యం సాధించిన వారికే తెలిసి ఉంటుందేమో.. తాజాగా ఓ సినీ నిర్మాత ఒంటిపై బట్టలు మినహా మొత్తం వలిచేసుకుని వెళ్లిపోయాడో దొంగ. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న (గురువారం) సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్దమైనవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి దేవుడు శాపాలు పెట్టారని.. ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడరంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట అభివృద్ధిని సీఎం కండ్లు ఉండి చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందని తెలిపారు.
Telangana: కేంద్రహోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో TPCC సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. హైదరాబాద్ను యూటీ చేయాలని కేటీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై కౌంటర్ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం జరిగింది.
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక ఛాపర్లో సీఎం యూపీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి యూపీకి రేవంత్ పయనమయ్యారు. రాయబరేలీకి వెళ్లేముందు ఖర్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు.