Home » Trending
జీవితాంతం కష్టపడి సంపాదించిన రూ.1.2 కోట్లు మొత్తాన్ని ఎఫ్డీల్లో పెట్టిన ఓ పెద్దాయన చాలా తప్పు చేశారని ఓ సీఏ నెట్టింట పోస్టు పెట్టారు. ఇది ఎంత ప్రమాదమో వివరించాక ఆయన పెట్టుబడుల పోర్టుఫోలియోను భవిష్యత్తు అవసరాలకు అనుగూణంగా మార్చినట్టు తెలిపార. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
బరువు తగ్గేందుకు ఓ హెల్త్ ఛాలెంజ్కు పూనుకున్న ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా జంక్ ఫుడ్ను అతిగా తిని దుర్మరణం చెందాడు. వారాల తరబడి జంక్ ఫుడ్ తిన్న అతడు ఓ రాత్రి వేళ నిద్రలోనే కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.
ఇంజనీర్గా విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకున్న ఓ మహిళ ఆ తరువాత వైద్య వృత్తివైపు మళ్లారు. ఈ ఆసక్తికర జర్నీ వెనుక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఓర్పుతో ఉంటే ఎంతటి అదృష్టాన్నైనా సొంతం చేసుకోవచ్చని ఓ చెన్నై వాసి నిరూపించారు. దాదాపు 15 ఏళ్లుగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన తాజాగా డీడీఎఫ్ లాటరీలో దాదాపు రూ.9 కోట్లు సొంతం చేసుకున్నారు. ఈ లాటరీలో మరో ఇద్దరు భారతీయులకు కూడా లక్ కలిసొచ్చింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆలస్యంగా టేకాఫ్ అవ్వడంపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మండిపడ్డారు. ఆలస్యానికి గల కారణాలను కూడా ప్రయాణికులకు సంస్థ వివరించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెళ్లిళ్లల్లో జనాలు ఒక చోట కూర్చుని సెలైన్ పెట్టించుకుంటున్న వైనం మీ కంట ఎప్పుడైనా పడిందా? ఈ మధ్య ఇలాంటి సీన్స్ ప్రతి పెళ్లిలో కనిపిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందో? దీని మంచి చెడులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
అమెరికాకు వెళ్లిన నెల రోజుల్లోపే జాబ్ పోగొట్టుకున్న ఓ భారతీయ యువకుడు తాను చేసిన అతిపెద్ద తప్పు ఒకటుందంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ గణిత సమస్యను పరిష్కరించడంతో పాటు సొల్యూషన్ను చేతి రాతతో రాసినట్టు ఓ చిత్రాన్ని నానో బనానా ప్రో ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీసింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
తమ సంస్థలో వారానికి ఆరు రోజుల పాటు రోజుకు పన్నెండు గంటల చొప్పున పని చేసే ట్రెయినీకి నెలకు రూ.1 లక్ష శాలరీ ఇస్తామంటూ ఓ బెంగళూరు సంస్థ నెట్టింట ప్రకటించింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ ఆఫర్ చూసి అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగొచ్చంటూ ఓ డాక్టర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుతో షాకయిపోయిన జనాలు తమ సందేహాలను ఆయన ముందుంచారు. వాటిల్లో చాలా ప్రశ్నలకు డాక్టర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.