Home » Trending
చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో తాజాగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. టూరిస్టు బాధ్యతారాహిత్యం కారణంగా ఓ దేవాలయం మంటల్లో దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
భారత నగరాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సులువైన పరిష్కారాన్ని సూచించారు. ఈ పరిష్కారంతో నగరాల లుక్ మారిపోతుందని చెప్పారు. ఈ సూచనతో అనేక మంది ఏకీభవించడంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఓ మేనేజర్ తన కొడుకు హోమ్వర్క్ను ఆఫీసులోని ఓ ఉద్యోగితో చేయించిన వైనం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై జనాలు షాకయిపోతున్నారు. వెంటనే సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఆ ఉద్యోగికి తేల్చి చెప్పారు.
యూపీలో ఓ వధువు వరుడికి ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లిలో ఆనందంతో ఫుల్లుగా డ్యాన్స్ చేసిన ఆమె ఆ రాత్రే కనిపించకుండా పోయింది. ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. వధువు జాడ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
బీటెక్లో క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కూడా అర్హత సాధించలేని యువకుడు ఐదేళ్లు తిరిగేసరికల్లా ఏకంగా రూ.1.7 కోట్ల శాలరీ సంపాదించే స్థితికి ఎదిగాడు. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్స్కు మూడు బ్లేడ్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే. అసలు బ్లేడ్ అమరిక వెనకున్న సాంకేతిక కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా ఇటీవల విడుదల చేసిన పిన్నీసు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీని ధర రూ.69 వేలని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరతో బీరువా మొత్తం నిండిపోయేలా దుస్తులు కొనుక్కోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
పరిశుభ్రతకు, ప్రజల పౌరస్పృహకు పర్యాయపదంగా నిలిచే సిక్కిం రాష్ట్రంపై ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. అయితే భారత్ గొప్పదనం చెప్పుకునేందుకు పాశ్చాత్య దేశాలతో పోలిక అవసరం లేని రోజు ఒకటి వస్తుందని తాను నమ్ముతున్నట్టు పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇంటి విషయాలను చక్కబెట్టేందుకు హోమ్ మేనేజర్ను నియమించుకున్నామంటూ ఓ ఏఐ సంస్థ అధిపతి నెట్టింట పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టుపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు తమ మనసులోని సందేహాలను ఆ సంస్థ అధిపతి ముందుంచారు.
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికాలోని ఓ భారత సంతతి ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, ఉపాధి సంబంధిత వీసా అని ఆయన అన్నారు. ఆ మేరకు వీసా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.