Home » Trending News
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పెద్దవారితో పాటు పిల్లలు కలిసి పార్క్లో చెత్తాచెదారం కవర్లలోకి ఎత్తేస్తుంటారు. ఆ పార్క్లో మొక్కల చుట్టూ ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, ఇనుప వస్తువులు పడి ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ కుందేలు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నులుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
11 ఏళ్ల విద్యార్థి.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో మార్గ మధ్యలో చిరుత సడన్గా కువారాపై దాడి చేసింది. ఈ ఘటనలో అతను ధైర్యంగా చిరుతపై ఎదురుదాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..
మనం అసహ్యించుకునే బొద్దింకలు.. వారికి కమ్మటి కాఫీని అందిస్తున్నాయి. బొద్దింకలతో తయారీ చేసే కాఫీని అక్కడి వారు ఎంతో ఇష్టంగా తాగుతున్నారట. ఓ మ్యూజియం నిర్వాహకులు.. ఈ బొద్దింకల కాఫీని పరిచేయం చేశారు. ఇంతకీ ఈ బొద్దింకల కాఫీ ఎలా తయారు చేస్తారు.. దీని రేటు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగువెన్నెల' 220 వ సాహిత్య సదస్సు.. డాలస్ టెక్సాస్లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ' మహాకవి వాక్పతిరాజు - సాహితీ విహంగ వీక్షణం ' అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.
జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. నౌగామ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!
దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కూరగాయల మొక్కలను చూస్తుంటాం. మరెన్నో రంగురంగుల పూల చెట్లూ తారసపడుతుంటాయ్. కానీ ఈ అరుదైన కూరగాయల మొక్కను ఎప్పుడైనా చూశారా? ఇంతకీ ఈ చిత్రవిచిత్ర మొక్క ఎక్కడుంది.? దాని విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ కథనం చదవాల్సిందే..