Home » Trains
ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
చార్మినార్ ఎక్స్ప్రెస్ సహా మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్కాగజ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.