Home » Trains
కైలాసగిరిపై ఉన్న టాయ్ రైలుకు ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యింది. దీంతో రైలు వెనక్కి జారింది.
రైల్వే చార్జీలు పెరిగాయి. ఈమేరకు భారతీయ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ నెల 21నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే..215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఓ వ్యక్తి ఫోన్లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ..
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు, నాంపల్లి రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.