Home » Tirumala
మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిరంజీవి సతీమణి సురేఖతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ శ్రీవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఆయన తిరుమల వెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను దర్శించారు. ఇవాళ(మంగళవారం) ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని రేవంత్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రేవంత్ కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది సుమారు 8లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు.
టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.
ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 లాంచ్కు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ)లో 25 ఏళ్ల క్రితం మొదలైన ‘శ్రీవారి సేవ’... దేశ, విదేశాల నుంచి స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే, లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా... సరిగ్గా 25 ఏళ్ల క్రితం (2000) పురుడు పోసుకుంది.
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపుకు ఏఐని వినియోగించాలని స్పష్టం చేసింది.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.