Home » Thanneeru Harish Rao
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..
నరేగా పథకంపై, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.పేదవారి పథకం గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యావరేజ్గా 20రోజుల పాటు మాత్రమే సభను నడిపారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ఏడాది 16రోజులు మాత్రమే సభను నడిపారని ప్రస్తావించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు.