Home » Thanneeru Harish Rao
మొక్కజొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని, కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రేడ్ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్రావు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గులాబీ పార్టీ కీలక నేతలు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ బాస్ కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితా రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు.
రేవంత్రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు.
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.