Home » TGSRTC
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ ఆరు వేల పైచిలుకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనుంది. జనవరి 9 నుంచి 13వ తేదీల మధ్య, ఆపై జనవరి 18, 19 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో నూతనంగా మరో వెయ్యి ఈవీ బస్సులను నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒక్క ఫిబ్రవరిలో 170 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. 2026 చివరి నాటికి మొత్తం వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య నియంత్రణ, ఆర్ధిక వెసులుబాలో భాగంగా నగరంలో మరిన్ని ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే.. మహిళలకిచ్చిన హామీ మేరకు మహాలక్ష్మిల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతోంది. కాగా.. ఈ 24 నెలల కాలంలో 118.78 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.