Home » TG Politics
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరానని తెలిపారు..
తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారంలో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు.
నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది రాజకీయ డ్రామానేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో మొదట నుంచి బీజేపీనే పోరాటం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని తెలిపారు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ)పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనినాస్గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు.