Home » TG Politics
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఛానెల్ను బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడో నిషేధించారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కాంలో రేవంత్రెడ్డినే లబ్ధిదారుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? అని ప్రశ్నించారు.