Home » TG Govt
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్లో కందులకు ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతి గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీ దగ్గరపడ్డ తరుణంలో వివిధ పనులన్నీ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కృష్ణా జలాల పంపిణీ అంశం ట్రైబ్యునల్-2 పరిధిలో అపరిష్కృతంగా ఉండటంతో ఈలోగా ఆ బాధ్యతను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉండే అత్యున్నత మండలి (అపెక్స్ కౌన్సిల్)కి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
భూ భారతి పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమాల తీగ లాగుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆధారాలను సేకరిస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.