• Home » TG Govt

TG Govt

పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి తుమ్మల

పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి తుమ్మల

రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అన్నదాతలు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్లు

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్లు

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించాయని వారు తెలిపారు. ఒకవైపు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి వ్యవస్థపై సీఎం ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహిళలకు గుడ్ న్యూస్..  ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ

మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీని పథకాన్ని ప్రారంభించనుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. శివకుమార్‌కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. శివకుమార్‌కు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం, తాజాగా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యుడు కె. శివకుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణ, లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలి:  మంత్రి సీతక్క

మహిళల ఆర్థికాభివృద్ధికి క్రమశిక్షణ, లాభదాయక వ్యాపారాలపై దృష్టి పెట్టాలి: మంత్రి సీతక్క

మహిళల విద్య, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లో మ‌హిళా సంఘ స‌భ్యుల ఎడ్యుకేష‌న్ ప్రోఫైల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు

హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న వాటాలన్నీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.

ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపామని ప్రస్తావించారు.

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐ సస్పెండ్

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐ సస్పెండ్

వికారాబాద్ జిల్లాలో లంచం కేసు తీవ్ర కలకలం రేపింది. తాజాగా జరిగిన పరిణామాల ప్రకారం.. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్‌ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల అనంతరం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి