Home » Telugu News
రాజాంలోని ఓ ప్రభుత్వ హాస్టల్లో కొంతమంది విద్యార్థులకు కొన్నాళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్న మైనర్ విద్యార్థి ని రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర సారధ్యంలో సంతకవి టి పొలీసులు శనివారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో పెద్దగా సీసీ కెమెరాలు ఉండవని.. సులభంగా చైన్స్నాచిం గ్ చేయొచ్చని స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు.. తాజాగా ఓ కేసులో కొత్తవలస పోలీసులకు చిక్కారు.
మండలంలోని గరికపాడు, తాలాడ గ్రామా ల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.అగ్రహారానికి చెందిన పైల నాగేశ్వరరావు(52) అనే వ్యక్తి మృతిచెందారు.
విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
‘Mana Ooru- Matamanti’ completes one year in Ravivalasa టెక్కలి మండలం రావివలస గ్రామస్థులకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్కల్యాణ్.. ‘మన ఊరు.. మాటామంతి’ కింద ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా, ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతి’ అనే స్ర్కీన్గ్రీవెన్స్ కార్యక్రమానికి పవన్కల్యాణ్ శ్రీకారం చుట్టారు.
పట్టణంలోని వార్డుల పునర్విభజన సక్రమంగా లేదని సీపీఐ నేతలు కూరంగి మన్మఽథరావు, బుడితి అప్పల నాయుడు, బుడి భారతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర పం చాయతీ కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రాన్ని శనివారం అందించారు.
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యం దశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Downed poles... no electricity or problems ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా లేక ఉక్కపోతతో అల్లాడిపోయారు.
Trees felled.. pillars toppled. గాలులు బీభత్సం సృష్టించాయి. చిన్న వానతో శుక్రవారం రాత్రి మొదలై కొద్ది క్షణాల్లో పెను గాలులుగా మారాయి. దీంతో వ్యవసాయ, విద్యుత్శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. ఉద్యాన పంటలు నేలవాలాయి. ఎక్కడికక్కడే విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. శనివారం సాయంత్రానికి కూడా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంటల నష్టాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.