• Home » Telugu News

Telugu News

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌)లో భాగంగా ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్న ఓటర్లు, వాటని పూరించి, ఫొటో అతికించి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు విజ్ఞప్తిచేశారు.

వైద్యానికి ఊతం

వైద్యానికి ఊతం

జిల్లాలోని అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేశారు. తాజాగా మూడు ఆస్పత్రుల్లో మందులు, ల్యాబ్‌, సర్జికల్‌ సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్ల త్రైమాసిక నిధులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ విడుదల చేసింది.

రేషన్‌... పరేషాన్‌

రేషన్‌... పరేషాన్‌

ప్రభుత్వం అందించే రేషన్‌సరుకుల కోసం నూతన పంచాయతీల్లోని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వివిధరకాల సరుకులు పంపిణీ చేసినా ప్రస్తుతం అందజేస్తున్న ఒక్క రేషన్‌ బియ్యం కోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

రైతన్నకు బీమాతో ధీమా

రైతన్నకు బీమాతో ధీమా

ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయే అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పీఎం పసల్‌ బీమా యోజనను మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేసిన పంటల బీమాను 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

 పరిశుభ్రతపై దృష్టి సారించండి

పరిశుభ్రతపై దృష్టి సారించండి

పాఠశా లలు, వసతి గృహాలు, అంగన్‌వాడీకేంద్రాల్లో వంట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు.

‘రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదు’

‘రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదు’

రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదని ఆమదాలవలస దస్తావేజు రైటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. ఈ మేర కు రెండోరోజు మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు.

బాబోయ్‌ హైవే

బాబోయ్‌ హైవే

జిల్లాలో జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి జలగలమదుం జంక్షన్‌ నుంచి పాయకరావుపేట వద్ద తాండవ వంతెన వరకు పలు జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ఆరు నెలల కాలంలో జాతీయ రహదారిపై మొత్తం 129 ప్రమాదాలు జరిగాయి.

వేతనాలివ్వడం లేదని మహిళా కార్మికుల ఫిర్యాదు

వేతనాలివ్వడం లేదని మహిళా కార్మికుల ఫిర్యాదు

సకాలంలో వేతనాలివ్వడం లేదని, వేతనాలపై అడిగితే కాంట్రాక్టర్‌ వేధింపులకు గురిచేస్తు న్నారని ఆదిత్యాలయంలో పనిచేస్తున్న శానిటేషన్‌, మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

అనకాపల్లి- సోలాపూర్‌ రైలు సెప్టెంబరు వరకు పొడిగింపు

అనకాపల్లి- సోలాపూర్‌ రైలు సెప్టెంబరు వరకు పొడిగింపు

అనకాపల్లి- సోలాపూర్‌ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్‌, రాయచూర్‌, కలబుర్గి మీదుగా షోలాపూర్‌ వరకు నడుస్తుంది.

వైభవంగా ఉమాజఠలేశ్వరస్వామి కల్యాణం

వైభవంగా ఉమాజఠలేశ్వరస్వామి కల్యాణం

పాతశ్రీకాకుళం నక్కవీధిలో వేంచేసి ఉన్న ఉమా జఠలేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళ వారం వైభవంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి