Home » Telugu News
సామాజిక, ఆర్థిక అభివృద్ధి విద్యతోనే సాధ్యమని ప్రభుత్వవిప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాల్మీకిభవనలో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కులప్ప ఆధ్వర్యంలో పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు.
సూర్య ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ముందురోజుతో పోలిస్తే కొంత మెరుగు. శుక్రవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, చిరుజల్లులు పడ్డాయి. దీంతో ఉదయం పూట కాస్త చల్లగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నాటికి ఎండ తీవ్రత పెరిగింది. సాయంత్రం కూడా వేడి తగ్గని పరిస్థితి ఉంది.
సిరిసిల్ల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైక్లు, ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు.
మలికిపురం/అల్లవరం,మే23(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగు పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కొద్దిరోజులుగా దారుణంగా పడిపోతున్న ఆక్వా ధరలను చూసి ఆక్వా రైతాంగం గుండె చెరువవుతోంది. ఇప్పటికే రొయ్యల తెగుళ్ల మందులు, మేత ధరలు పెంచి విక్రయాలు సాగిస్తుండడంతోపాటు విద్యుత్ సరఫరా ఇబ్బందులు కూడా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటికితోడు వాతావరణ మార్పులు మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మొక్కల నాటే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను అదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25వ తేదీని నుంచి 30వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాలను ఘనంగా చేపట్టి విజయ వంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.
యువతి, యువకులకు ఉపాధి మార్గాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
జిల్లాలో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్వోలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని కరీంనగర్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆదేశించారు.