• Home » Telugu News

Telugu News

గ్రామీణ వైద్యంలో విప్లవం

గ్రామీణ వైద్యంలో విప్లవం

గ్రామీణ ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. యాదమరిలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీలో సంజీవని డిజిటల్‌ సేవలు, ఓపీ నమోదు, మందుల పంపిణీ దాకా పరిశీలించారు. పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్‌ (పీసీసీ) డెస్క్‌ వద్ద జరిగే నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌, విజిట్‌ రికార్డులు, జనరేషన్‌, పేషెంట్‌ మ్యాపింగ్‌ విధానాన్ని సిబ్బంది సీఎంకు వివరించారు.

ఈ ఏడాదే   ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ఈ ఏడాదే ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన నాగరాజు(52)పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయపురం మండలంలోని ఓ దళితవాడకు చెందిన నాగరాజు.. స్థానికంగా ఉన్న ఓ చిన్నారికి మామిడి పండు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపు వేసి లైంగిక దాడికి పాల్పడగా, చిన్నారి ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె ఏడుపును పసిగట్టిన తల్లి వెళ్లి తలుపు తీసి చూడగా నాగరాజు వికృత చేష్టలు బయటపడ్డాయి. అతడికి దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేశారు. పరారీలోని నిందితుడిని అదుపులోకి తీసుకొని శనివారం రిమాండుకు తరలించారు.

సర్వదర్శనానికి 24 గంటలు

సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

మంచినీటి చెరువుల్లో దర్జాగా ఆక్వా సాగు..!

మంచినీటి చెరువుల్లో దర్జాగా ఆక్వా సాగు..!

కైకలూరు మండలం లో కొల్లేరు గ్రామాలకు తాగునీరందించే పెంచికలమర్రు లోని సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లో 40 ఎకరాల్లో అక్రమంగా చేపలు, రొయ్యల సాగు నిరాటకంగా సాగిపోతోంది.

భీమగరం

భీమగరం

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం వేడిసెగలు కక్కే ప్రాంతంగా రికార్డులకెక్కడం ఆందోళన కలిగిస్తోంది.

చుర్రుమంటూ..!

చుర్రుమంటూ..!

జిల్లాలో శనివారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు సూరీడు కొంత శాంతిం చాడు. ఉదయం సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన గాలులు వీచాయి. ఇక మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం చూపాడు.

నిలువు కాళ్లపైనే...

నిలువు కాళ్లపైనే...

ప్రొలాంగ్‌ స్టాండింగ్‌ జాబ్‌...ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా, ఎంతోమంది చేస్తున్న ఉద్యోగాలు ఇవే.

పరిచయస్తులే ప్రాణాలు తీస్తున్నారు

పరిచయస్తులే ప్రాణాలు తీస్తున్నారు

దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

జూలై 8 తరువాత ఏ విమానాశ్రయానికి వెళ్లాలో చెక్‌ చేసుకోండి

జూలై 8 తరువాత ఏ విమానాశ్రయానికి వెళ్లాలో చెక్‌ చేసుకోండి

విశాఖపట్నం నుంచి జూలై ఎనిమిదో తేదీ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి విమాన టికెట్లు తీసుకునే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి