Home » Telugu News
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతోపాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది.
తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.
ముచ్చటగా మూడో సారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్ వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ లేఖ రాశారు. అందులో హోం గార్డులు పడుతున్న ఇబ్బందులతోపాటు నెల్లూరు, బాపట్లలోని తీర ప్రాంతాల్లోకి తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడ్ బోట్లతో తరలి వచ్చి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు.
ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయించారు.
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది.
రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. దీంతో షాక్కు గురైన అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. తన వద్ద స్కూటీ లేదు కదా.. చలానా ఏంటని మెసేజ్ ఓపెన్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.