Home » Telugu News
అనకాపల్లి- సోలాపూర్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైలును ఈ ఏడాది సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు అనకాపల్లి నుంచి విజయవాడ, తిరుపతి, మదనపల్లె, ధర్మవరం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది.
పాతశ్రీకాకుళం నక్కవీధిలో వేంచేసి ఉన్న ఉమా జఠలేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళ వారం వైభవంగా నిర్వహించారు.
సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
యాసంగి సీజన్లో అంచనాలకు మించి వచ్చిన దిగుబడిని రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాసం గి సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో ప్రైవేట్ ఇంటర్మీడియట్ గోదాముల్లో నిల్వ చేశా రు.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు జిల్లా సబ్ జూనియర్స్ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.
‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్ జగన్మెహన్రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.
పలాస నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ధమీమ్ అన్సారియాకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం కోరారు.
ప్రసుత్త వానాకాల సీజన్లో ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాతబస్టాండ్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలీష్ చేస్తూ నిరసన చేపట్టారు.
రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.