Home » Telugu News
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని నడుముకు కట్టుకుని, ఒక తల్లి సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.
వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పేర్కొన్నారు.
ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.