Home » Telugu News
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో నిర్లక్ష్యంతోపాటు అసంతృప్తికర పనితీరుపై కలెక్టర్ రాజాబాబు సీరియస్ అయ్యారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అర్జీల పరిష్కారంలో లోపాలను ఆయన గుర్తించారు.
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు, ఎస్ఎన్పాడు నియోజకవర్గాల్లో ఈనెల 28న లోకేష్ పర్యటించనుండగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమా ర్లు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.14కోట్లతో చేపట్టనున్న పనులకు ఈనెల 28న మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమిపూజ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముంపు ప్రజలు గ్రామాలు వదిలి వెళ్తున్నందున విద్యకు అటంకం ఏర్పడకూడదన్న సంకల్పంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించింది.
ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ (యువ భవన్) భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరయ్యాయి.
గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనంపై పంచాయతీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
పైసా పెట్టుబడి లేకుండా పదిహేనేళ్లుగా ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్మిల్లర్లు పక్కదారి పట్టించి 400చకోట్ల రూపాయలు స్వాహా చేశారు.
ప్రయాణికుల భద్రతకు, సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సూచించారు.
సర్-2026 ప్రక్రియలో భాగంగా మృతులు, డబుల్ ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి, ఈనెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు.