Home » Telugu News
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించే ప్రకాశం, మార్కాపురం జిల్లాల సమా వేశంలో సాగు, తాగునీటికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ముందస్తు సమావే శంలో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయిం చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం నివాసంలో సమావేశం జరిగింది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో మళ్లీ ఇష్టారాజ్యం నెలకొంది. గత కొన్నేళ్లుగా బోగస్ గ్రూపులు సృష్టించి అమాయక పొదుపు మహిళలను బాధ్యులుగా చేసి రూ.లక్షలు దండుకున్న పలువురిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది.
వంగ సాగు చేసిన రైతులు బెంగ పడుతున్నారు. ఇటీవల వరకు పది కిలోలు రూ.300 వరకు ఉన్న వంకాయల ధర ప్రస్తుతం రూ.60కు పడిపోయింది. కిలో రూ.30 చొప్పున ధర ఉంటేనే సాగుచేసిన రైతులకు పెట్టుబ డులు వచ్చేది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థికసంఘం నిధులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్పంచ్ల పదవీకాలం ముగింపు దశకు రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికసంఘం నిధులను ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆంక్షలు విధించింది.
‘సీబీఐ మాకు న్యాయం చేయలేదు. పోలీసులు ఏం చేశారో సీబీఐ అదే చేసింది. మా కుమార్తె హత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఇక న్యాయపోరాటం చేసే ఓపిక, శక్తి మా దగ్గర లేవు. బీఫార్మసీ విద్యార్థిని అయేషామీరా కేసు విచారణ సందర్భంలో ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. దర్యాప్తు సంస్థలు తమకు న్యాయం చేయలేవు అని వారు కోర్టుకు స్పష్టం చేశారు. అయేషా మీరాపై లైంగిక దాడి, హత్య కేసులో చివరకు ఆమె తల్లిదండ్రులకు ఆవేదన మాత్రమే మిగిలింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు ముందడుగు పడింది. తొలి దశ పనులు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన డీపీఆర్ సిద్ధమైంది. మొదటి దశ పనులు కేతనకొండ నుంచి నున్న మీదుగా చోడవరం వరకు 67.6 కిలోమీటర్లు సాగనున్నాయి. త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల కానుంది.
బెజవాడ సిటీ బస్ ఆపరేషన్లో అతి ముఖ్యమైన విద్యాధరపురం బస్ డిపో నుంచి ఇక సేవలు నిలిచిపోనున్నాయి. తక్షణం ఖాళీ చేసి తమకు స్వాధీన పరచాల్సిందిగా ఆర్టీసీ హెడ్ ఆఫీస్ ఇంజనీరింగ్ విభాగం నుంచి విజయవాడ రీజనల్ అధికారులకు ఆదేశాలు అందాయి. నగరంలో ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ విద్యాధరపురం డిపో కేంద్రంగా చేపట్టాలని నిర్ణయించారు. డిపో పరిధిలోని బస్సులను సమీపంలోని డిపోలకు కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో మస్తర్ల మాయాజాలం నడుస్తోంది. అక్రమ సంపాదన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం బురిడీ కొట్టించే కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఐరిస్ మస్తర్ అమల్లో ఉన్నా యథేచ్ఛగా విధులకు పారిశుధ్య కార్మికులు డుమ్మా కొడుతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 800 నుంచి 1000 మంది పారిశుధ్య కార్మికుల గైర్హాజరవుతున్నారు. వీరంతా బయట మరింత ఆదాయం వచ్చే పనులకు వెళ్తున్నారు. ఇలా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించినందుకు ఒక్కొక్క కార్మికుడు లీడ్ మేస్త్రీలకు రూ.500 నుంచి రూ.700 వరకు సమర్పిస్తున్నారని సమాచారం. ఈ విధంగా ఏటా రూ.18 కోట్ల వరకు అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఎట్టకేలకు గోకవరం పీఏసీఎస్లో అవినీతి లెక్క తేలింది. కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. వీటిలో సెక్రటరీ రూ.5 కోట్లు దుర్వినియోగం చేస్తే, సొసైటీ అధ్యక్షుడు రూ.1.20 కోట్లు వాడేసుకున్నాడు. మిగిలిన నగదు దుర్వినియోగంలో డైరెక్టర్ల, ఇతర అధికారుల పాత్ర ఉంది. 51 విచారణ చేపట్టిన అధికారులు ఈ అక్రమాలను ఆధారాలతో సహా నిగ్గుతేల్చారు. కేడీసీసీబీ సీఈవోకు దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు.
స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు రావడంతో ప్రారంభోత్సవానికి దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సుముహూర్తం నిర్ణయించారు. మార్చి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పాలకవర్గం చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఆలయంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు.