Home » Telugu News
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 2న కెరమెరి మండలంలోని కోటారి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్ అధికారులను ఆదేశించారు
శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస సమీపంలో పెండింగ్ లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం సదరు స్థలాన్ని పరిశీలిం చి భూమి పూజ చేశారు.
జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో ఉద్యోగి ధార సింహాచల పాత్రో (57) అలియాస్ ధారబాబు పాత్రో శనివారం ఉదయం జెన్కో కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతున్నది.
ఎచ్చెర్ల నియోజక వర్గం పరిధిలోని మత్స్యకారుల సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలో పది వేల మందికి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందనున్నాయి.
దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో విశిష్ట సేవలు అం దించిన జిల్లా పోలీస్ శాఖకు చెందిన 118 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకమైన పోలీస్ ఆంత్రిక్ సుర క్షా సేవా పథక్-2022 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఎంపికైన పోలీస్ సిబ్బందికి పతకాలు ప్రదానం చేసి అభినందించారు.
మన్యంలో శనివారం ఎండ తీవ్రంగా కాసింది. దీంతో ఏజెన్సీ వాసులు అల్లాడిపోయారు.
మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ఘటన కలకలం రేపింది. విద్యుత్ ఉత్పత్తి తర్వాత వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఊహించని విధంగా వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ యార్డ్లో సాంకేతిక సమస్య ఏర్పడి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో వైద్యాధికారులు అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు చికిత్స అందించి రికార్డు సృష్టించారు.