Home » Telugu News
యర్రం చిన్నపొలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పునరావాస గ్రామాల వారికి వెంటనే పరిహారం చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి తెలిపారు. బుధవారం కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయంలో పునరావాస గ్రామాలు అయిన కొరిశపాడు, ఆగ్రామశివారు తూర్పు గ్రామాల ప్రజలతో ఎస్డీ తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మెహతాజ్లు సమావేశం అయ్యారు.
రెండు నెలల్లో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయా లని అధికారులు, కాంట్రాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
మహిళ ల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఎన్నికలకు ముందు తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు.
బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్ పరిశీలించారు.
దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
గ్రానైట్ పరిశ్రమల్లో వచ్చిన అధునాతన యంత్రాల ద్వారా విపరీతంగా ఉత్పత్తి పెరగడం.. అదే స్థాయిలో డిమాండ్ తగ్గి అమ్మకాలు పడిపోవడం.. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన వ్యాపారులు బల్లికురవ ప్రాంతంలో రాజస్థాన్కు చెందిన వారు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.