Home » Telugu News
జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. శనివారం మాకవరపాలెంలో 45.5, కశింకోట 43.4, నాతవరం, నక్కపల్లి 43.3, గొలుగొండ 43.1, నర్సీపట్నం 43, ఎస్.రాయవరం 42.7, పాయకరావుపేట 42.2, కోటవురట్ల 42, బుచ్చెయ్యపేట 41.6, మునగపాక 41.3, దేవరాపల్లి 40.8, రావికమతం, రోలుగుంట, రాంబిల్లి 40.7, ఎలమంచిలి 40.2, కె.కోటపాడు 40, అనకాపల్లి, సబ్బవరం 39.5, మాడుగుల 39.3, చోడవరం 38.9, అచ్యుతాపురం 38.8, చీడీకాడలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేటు వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వృద్ధురాలు మృతి చెందిందని ట్రాఫిక్ ఎస్ఐ డి.శేఖరం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
జిల్లాలో ఆయిల్పామ్ సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లుగా జిల్లా ఉద్యానశాఖ అధికారులు రైతుల్లో ఆయిల్పామ్ సాగుపై అవగాహన పెంచుతూ వస్తున్నారు.
నకిలీ విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా సరఫరా అవుతు న్నాయి. ఎన్ని నిషేధాలు విధించినా అక్రమ విత్తన దం దా మాత్రం ఆగడం లేదు.
పాత కక్షలు, కుటుంబ కలహాలతో దహెగాం మండ లం మొట్లగూడ గ్రామంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా అఽధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆరోపించారు. తరుగు పేరిట ఒక్కో ధాన్యం లారీపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు దోచుకొని పంచుకుంటున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు చేసిన వినియోగించినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ ల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. శని వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం శ్రమించి నిధులు సమకూరిస్తే అధికారులు నిద్రపోవడం ఏమిటని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.