Home » Telugu News
రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీ నెంబర్లు లేకుండా చూడాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
మండలంలో ప్రవహించే కేసీ కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కాలువకు పూర్గిగా నీరు విడుదల చేసినా ప్రవాహ వేగం తగ్గే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ విధానంలో ట్రేడ్ లైసెన్స్ల జారీ ఫ వివరాలు నమోదు చేస్తున్న మునిసిపల్ సిబ్బంది
అద్దె విలువలపై 5 ఏళ్లకు ఒకసారి ఇంటి పన్ను పెంచే విధానాన్ని రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావశంలో వక్తలు డిమాండ్ చేశారు
:గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయి రెమ్యూనరేషన్ అందుకోని రైతులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తహసీల్దార్ సింగారావును ఆదేశించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ బుధవారం ముప్పవరం వద్ద (బీకేవీ 544జీ) గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు.
గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.
కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల నల్లమల అడవి ప్రాంతం బుధవారం రాత్రి నిలువునా అగ్నికి ఆహుతి అవుతోంది. మహానందికి అత్యంత సమీపంలోని నల్లమల అడవి ప్రాంతం ఇప్పటికే పలుమార్లు అంటుకొని నిలువునా కాలిపోయింది.
యర్రం చిన్నపొలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకం పునరావాస గ్రామాల వారికి వెంటనే పరిహారం చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి తెలిపారు. బుధవారం కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయంలో పునరావాస గ్రామాలు అయిన కొరిశపాడు, ఆగ్రామశివారు తూర్పు గ్రామాల ప్రజలతో ఎస్డీ తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మెహతాజ్లు సమావేశం అయ్యారు.
రెండు నెలల్లో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయా లని అధికారులు, కాంట్రాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
మహిళ ల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.