Home » Telugu News
వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం సాయంత్రం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలంగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం పడింది.
Prabhu Kumar finds a place in Guinness World Records సంతబొమ్మాళి మండల కేంద్రానికి చెందిన కళింగపట్నం ప్రభుకుమార్ అరుదైన ఘనత సాధించాడు. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.
Preparing for the Hybrid Mahanadu హైబ్రిడ్ మహానాడుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కస్టర్లుగా విభజించుకుని అనుకూలమైన ప్రాంతాల్లో వేదిక నిర్ణయించనున్నారు.
టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులోని కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
Petrol prices increased పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచేసింది.
Are those shops allowed? ‘దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలోచన.. మీ ఇష్టం ఎక్కడో ఒక చోట పెట్టేసుకోండి.. సార్లతో మాకు పరిచయాలు ఉన్నాయి. మేము ఏదో ఒకటి చెప్తాం.. మా సంగతి కాస్త చూడండి’ అంటూ కిందిస్థాయి సిబ్బంది భరోసా ఇవ్వడం.. ఆపై చకచకా షాపులు ఏర్పాటు కావడం ఇటీవల కాలంలో విజయనగరంలో చురుగ్గా జరుగుతోంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో సిబ్బంది మునిగితేలుతున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్ కో-ఆర్డినేటర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ పిలుపునిచ్చారు
Will dog bites be controlled? వీధి కుక్కల బెడద నుంచి త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. వాటి సంఖ్య భవిష్యత్లో తగ్గనుంది. నియంత్రణకు కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో యంత్రాంగం కదులుతోంది. బొబ్బిలి కేంద్రంగా మూడు మున్సిపాలిటీల కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నారు. హర్యానాకు చెందిన స్నేహ ఏజెన్సీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలనకు నేడో రేపో బొబ్బిలి రానున్నారు.
జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. శనివారం మాకవరపాలెంలో 45.5, కశింకోట 43.4, నాతవరం, నక్కపల్లి 43.3, గొలుగొండ 43.1, నర్సీపట్నం 43, ఎస్.రాయవరం 42.7, పాయకరావుపేట 42.2, కోటవురట్ల 42, బుచ్చెయ్యపేట 41.6, మునగపాక 41.3, దేవరాపల్లి 40.8, రావికమతం, రోలుగుంట, రాంబిల్లి 40.7, ఎలమంచిలి 40.2, కె.కోటపాడు 40, అనకాపల్లి, సబ్బవరం 39.5, మాడుగుల 39.3, చోడవరం 38.9, అచ్యుతాపురం 38.8, చీడీకాడలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.