Home » Telugu Desam Party
అశోక్గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో మంగళవారం ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు.
ఏపీలో అశాంతి సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపించారు. త్వరలోనే పేర్ని నాని జైలుకు పోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని మంత్రి డీబీవీ స్వామి ప్రశ్నించారు.
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.