Home » Telangana
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు (3-6 ఏళ్ల లోపు) ఏక రూప దుస్తులు ప్రభుత్వాలు అందించనున్నాయి. గత ఏడాది అక్టోబరులో మహిళా శిశు సంక్షేమ శాఖ కమి షనరేట్ నుంచి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమాధి కారుల కార్యాలయాలకు దుస్తులకు సంబంధించిన వస్త్రం పంపిణీ చేశారు. మండలాల్లోని ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో టైలరింగ్ ద్వారా ఉపాధి పొందే మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పనులు అప్పగించారు.
క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆటల పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు రెండో స్థానం సాధించినందున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్, షీల్డ్లు అందజేశారు
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాలోని తిర్యాణి మండలం చింతపల్లి గ్రామంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
స్థానిక సంస్థల్లో కీలకమైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ప్రాదేశిక పోరుపైకి మళ్లింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో జిల్లాలోని ప్రధాన పార్టీలు పోరుకు సన్నద్ధమతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..
హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.