Home » Telangana
విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు.
రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనే అని ఆయన తల్లి రాధిక(Radhika) స్పష్టం చేశారు. పోలీసులు రోహిత్ వేముల(Rohit Vemula) కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని, చదవలేక చనిపోయారని పోలీసులు(Telangana Police) రిపోర్టులో పేర్కొన్నారని, ఇది పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు.
Telangana: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు.
Telangana: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్ను రూపొందించింది.
హైదరాబాద్ మహా నగరంలో అత్యంత కీలకంగా ఉన్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కుల సమీకరణలు మొదలయ్యాయి.
ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ.. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రఘు రాం రెడ్డి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. గతంలో నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికి ఎక్కువ మెజార్టీ తెలంగాణలో ఇచ్చారన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరిట సోషల్ మీడియాలో అరుణ్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగానూ ఆయన పనిచేస్తున్నారు. పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో నిన్న రాత్రి అరుణ్ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు.
Telangana: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైంది. రేవంత్ పాలనలో పంట పెట్టుబడి సహాయం అందలేదు మార్పు మొదలైంది. అనేక పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో కోతతో మార్పు మొదలైంది. పంటలు ఎండటంలో మార్పు. అక్రమ కేసులు పెట్టడంలో, జైళ్లు నింపడంలో మార్పు మొదలైంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. రాపోలు ఆనంద భాస్కర్తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు.